koodali

Monday, July 25, 2016

అన్న క్యాంటీన్లు మరియు...


  అన్న క్యాంటీన్ల వల్ల ఎందరికో ఉపయోగం జరుగుతోంది.  ఇలాంటివి రాష్ట్రమంతటా  విస్తరించితే ఎందరికో లాభం జరుగుతుంది.


 ఈ రోజుల్లో అనేక కారణాల వల్ల ఉపాధి లభించటం ఎందరికో కష్టంగా ఉంది.


ఉపాధి లేకపోయినా  పేదలకు  కనీసం  తక్కువ ధరకు ఆహారం లభిస్తే ఎంతో మంచిది.

ప్రభుత్వాలు తక్కువ ధరకు ఆహారాన్ని అందించటం వల్ల ప్రజల ఆకలీ తీరుతుంది. ప్రభుత్వాలకూ మంచి పేరు వస్తుంది.


తమిళనాడులో ఇలాంటి అమ్మా క్యాంటీన్ల వల్ల ఎందరో పేదవాళ్లు కడుపు నింపుకుంటున్నారు. అక్కడ ఇంకా ఎన్నో పధకాలు ఉన్నాయి.


అక్కడ ఉన్న ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావటానికి ఈ పధకాలు కూడా ఎంతో దోహదపడ్దాయి.


తమిళనాడులో కొత్త ప్రభుత్వం వస్తే పాత పధకాల అమలు ఉంటుందో ? ఉండదో? అనే భయం వల్ల కూడా ప్రజలు ఉన్న ప్రభుత్వానికే ఓటు వేసి ఉండవచ్చు.

ఇక ఇంకుడుగుంతల త్రవ్వకం, మొక్కలను నాటడం కూడా చాలా మంచి విషయాలు.  ఇందులో  ప్రజలు కూడా ఆసక్తిగా పాల్గొనటం మంచి విషయం.

..................................

 అయితే, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలలో అణువిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాలనుకోవటం మాత్రం అత్యంత బాధాకరమైన విషయం.


ప్రపంచమంతటా  సో లార్, పవన విద్యుత్ వంటి హరిత విద్యుత్ కోసం ప్రయత్నిస్తుంటే....  ఆంధ్రప్రదేశ్లో అణువిద్యుత్ కర్మాగారాలు  నిర్మించాలనుకోవటం అత్యంత బాధాకరం ఐన విషయం. కేంద్రం ఈ విషయాలలో  తిరిగి ఆలోచించటం మంచిది.



Friday, July 22, 2016

ఈ రోజుల్లో ఆహారం గురించి కొన్ని విషయాలు.. మరియు సోయా గురించి..


 
ఈ రోజుల్లో ఆహారపద్ధతులలో విపరీతమైన మార్పులు వచ్చాయి.

  అజనిమోటో, సోయాసాస్, వెనిగర్, సోడా ఉప్పు, బేకింగ్ పౌడెర్..వంటివి విరివిగా వాడిన ఆహారానికి ప్రజలు బాగా అలవాటుపడ్దారు.

 పొంగి కరకరలాడుతూ ఉండటానికి... సోడా ఉప్పు, బేకింగ్ పౌడెర్..


 ఒకవిధమైన రుచి పెరగటం కోసం ....అజనిమోటో, సోయాసాస్, వెనిగర్ వంటివి బాగా వాడుతున్నారు.

 అజనిమోటో ఎక్కువగా వాడకూడదు.

 ఇవన్నీ వాడటం వల్ల ఆహార పదార్ధాలకు ఒక విధమైన  రుచి  రావటం వలన  వీటి  వాడకం  బాగా పెరిగింది.

 ఆ రుచికి అలవాటుపడటం వల్ల  మళ్లీమళ్లీ అవే తినాలనిపిస్తుంది.  అలా శరీరంలోకి  వెళ్లే అజనిమోటో పరిమాణం బాగా పెరుగుతుంది.

ఇంట్లో చేసుకునే వంటలలో కూడా అజనిమోటో, సోడాఉప్పు వంటివి ఎక్కువగా వాడటాన్ని తగ్గించాలి.

నాకు తెలిసినంతలో సోయాసాస్ , వెనిగర్ వంటివి పదార్ధాలను నెలల తరబడి పులవబెట్టి తయారుచేస్తారు.

   కెమికల్స్ తో కూడా సోయాసాస్, వెనిగర్ తయారుచేస్తారట.


కొన్ని దేవాలయాలకు  సమీపంలో యాత్రికులు వెళ్ళే దారిలో కూడా  నూడిల్స్ వంటి  ఫాస్ట్  ఫుడ్   అమ్ముతున్నారంటే ప్రజలు వీటికి ఎంతలా అలవాటుపడ్డారో తెలుస్తోంది.

 మన పూర్వీకులు  సోడాఉప్పు వంటివి  వాడకుండానే వెన్న వాడి  కరకరలాడే రుచికరమైన స్నాక్స్ చేసేవారు.

 
 *************

ఇంకో విషయం ఏమిటంటే,  ఆరోగ్యానికి మంచిదని భావించి.... ఈ రోజుల్లో సోయా కు సంబంధించిన పదార్ధాలు కూడా ఎక్కువగా వాడుతున్నారు.


అయితే, సోయా మంచిదే కానీ  పరిమితి మించి మరీ ఎక్కువగా సోయాను తినకూడదంటున్నారు.

ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలు ఈ క్రింద లింక్  ద్వారా తెలుసుకోగ
రు.


Benefits of Soy & Soy Protein Dangers | Natural Health Newsletter

************

పాతకాలంలో గుగ్గిళ్లు.. అంటే నానబెట్టి ఉడికించిన పెసలు, శనగలు..వంటివి తినేవారు. అప్పటివారు శారీరికంగా బాగా పనిచేసేవారు. శారీరికంగా పనిచేసేవారికైనా , మానసికంగా పనిచేసేవారికైనా మంచి పోషకాహారం అవసరం.


కొందరేమో పెసలు, శనగలు వంటివి ఎక్కువగా తినకూడదంటారు, ఎక్కువ తింటే కిడ్నీలు పాడైపోతాయంటారు. మరి కొందరేమో మొలకెత్తిన పెసలు, శనగలు..వంటివి తినాలంటారు. ఈ రోజుల్లో రకరకాలుగా చెప్పటం వల్ల గందరగోళంగా ఉండి ఏం తినాలో? ఏం తినకూడదో? ఎంత తినాలో? వంటి సందేహాలు ఎక్కువయ్యాయి.



ఈ రోజుల్లో ప్రొటిన్స్, కార్బోహైడ్రేడ్స్.. అంటారు. ప్రాచీనులు నవధాన్యాల గురించి తెలియజేసారు. మనం రెండు లేక మూడు ఇడ్లీలు, రెండు లేక మూడు దోసెలు, రెండు చపాతీలు..అలా లెక్కప్రకారం తింటే ఎక్కువతక్కువ కాకుండా ఉంటుంది.అరడజను అలా తినకూడదు.అన్నం మనిషికి సుమారు అరకప్పు బియ్యంతో వండితే సరిపోతుందంటారు.


  నిమ్మకాయ వంటి పుల్లటిపండ్లు మరీ ఎక్కువ కాకుండా కొన్ని తినాలి.ఇంకా, పురుగుమందులు వేయని, దేశవాళి కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెలు..వాడితే మంచిది.

ఆహారం తీసుకోవటంలో కొన్ని పద్ధతులు..ఎవరి పద్ధతిని బట్టి వారు మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.

ఉదయం ఆకుల కషాయం..ఉదా..జామాకు..వంటివి వేడి నీటిలో 2 నిమిషాలు కాచి ఆ నీటిని తాగాలి.

నెలకు నాలుగు రోజులు ధనియాల కషాయం..ఉదా.. నెలలో మొదటి నాలుగురోజులు..

link.. జలుబు, దగ్గు తగ్గటానికి ఈ పానకం.......... 

చ్యవంప్రాశ్ కూడా తీసుకోవచ్చు.



మొర్నింగ్ బ్రేక్ఫాస్ట్ .. ఇడ్లి..దోస..పూరీ..పొంగణాలు..ఉప్మ..రోజు విడిచి రోజు ఒక గ్లాస్ రాగుల జావ..రోజులో ఎప్పుడైనా రాగుల జావ త్రాగవచ్చు.జొన్న జావ కూడా తాగవచ్చు.

భోజనంలో చక్కగా అరిగే పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి..

వారంలో రెండు సార్లు మునగాకు జ్యూస్
వారంలో ఒక సారి బూడిదగుమ్మడి జ్యూస్
వారంలో ఒకటి లేక రెండుసార్లు కొబ్బరి నీరు
 
నువ్వుల ఉండలు వారానికి రెండు తినవచ్చు.
వేడిచెయ్యకుండా మెంతిపిండికానీ, మెంతులు కానీ వాడవచ్చు.

ప్రతిరోజు ఫ్రూట్స్

సలాడ్ అండ్ డ్రైఫ్రూట్స్  వారానికి 3 సార్లు..

గ్రీన్ జ్యూస్ వీక్లి 3 సార్లు...పుదీనా, కొత్తిమీర వంటి వాటి జ్యూస్ ..

రాత్రిపూట.. వీక్లి 2 సార్లు చపాతీలు..మిగిలిన రోజుల్లో..జొన్న ఉప్మా..జొన్న దోసలు..జొన్న ఇడ్లి..

వారానికి ఒకసారి లేక రెండుసార్లు.. పకోడి..బజ్జి..లేక ..చాట్..

15 రోజులకు ఒకసారి(నెలకు రెండు సార్లు).. స్నాక్స్..కారప్పూస అండ్ స్వీట్..వండుకుని నెలలో ఎప్పుడైనా తినవచ్చు.

వారంలో రెండుసార్లు తలకు..నూనె నిదానంగా మర్దన చేయాలి.

రోజూ ఉదయానే లేచి సూర్యనమస్కారాలను లేత ఎండలో చేయటం.. ఉదయంగానీ సాయంకాలం కానీ అర్ధగంటయినా ఎండ శరీరానికి తగలాలి.


కనీసం అర్ధగంట నడవాలి...ఉదయం కానీ, సాయంకాలం కానీ తక్కువ ఎండలో నడిస్తే ..ఎండ తగలటం, నడవటం అనే రెండు పనులు ఒకేసారి జరుగుతాయి. నడిచేటప్పుడు దైవనామాన్ని కూడా నిదానంగా అనుకోవచ్చు. 


కనీసం 15 నిమిషాలన్నా ధ్యానం చేయాలి. మీకు ఇష్టమైన దేవుని నామాలను వింటూ కూడా ఉండవచ్చు. అయితే, ధ్యానం, ప్రాణాయామం..వంటివి శిక్షకుల వద్ద అభ్యసించి చేస్తే మంచిది.

 ధ్యానం ద్వారా అనేక ఆలోచనల నుంచి కొంతసేపైనా మనస్సుకు విశ్రాంతిని ఇవ్వవచ్చు.

 
జీవితం అంటే కొన్ని టెన్షన్లు ఉంటాయి కదా..మన చుట్టూ టెన్షన్ పరిస్థితులు ఉన్నప్పుడు, మనకు కొంతయినా టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది.

 కానీ, మనం ఆరోగ్యంగా ఉండాలంటే టెన్షన్ ఎక్కువ ఉండకుండా తామరాకుమీద నీటిబొట్టులా జీవించటాన్ని తప్పక నేర్చుకోవాలి.

 జీవితంలో మన చేతనైనంత మనం చేసి,  దైవంపై భారం వేయాలి.  నిష్కామకర్మ యోగంతో జీవించటాన్ని అభ్యసించాలి.

శక్తి చాలనప్పుడు ..సరైనవిధంగా జీవించే శక్తిని ప్రసాదించమని దైవాన్ని శరణువేడుకోవాలి.

అంతా  దైవం దయ.

Monday, July 18, 2016

ఓం


గురువులకు అనేక వందనములు.


  .............

Saturday, July 16, 2016

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు...

ఈ రోజులలో  ప్రజలు రోగాల బారిన పడటం ఎక్కువగా జరుగుతోంది.  

వయస్సుతో సంబంధం లేకుండా  చిన్నపిల్లలు  కూడా ఎక్కువగా వ్యాధుల బారిన పడుతున్నారు. 

ఇలా  జరగటానికి అనేక కారణాలున్నాయి.

 వాతావరణ కాలుష్యం బాగా పెరగటం , పంటలు పండించటానికి రసాయన ఎరువులు వాడటం , చదువు, ఉద్యోగ వత్తిళ్ళు పెరగటం..ఇలా అనేక కారణాలున్నాయి.

 ఈ రోజుల్లో  ఇంటి శుభ్రత కోసం వాడుతున్న రకరకాల రసాయనాల వల్ల కూడా భూమి, నీరు కలుషితం అవుతున్నాయి.


 ఇలా కలుషితమైన మట్టి, నీటితో పంటలు పండించటం  అనారోగ్యకరం.
..............................

 అనారోగ్యం రావటానికి  ఇంకో ముఖ్యమైన కారణం ఏమిటంటే ..చిన్నతనం నుంచి తీసుకునే ఆహార  పద్ధతిలో వచ్చిన విపరీతమైన  మార్పులు.

 పాతకాలంలో ఇంట్లోనే  తయారుచేసిన ఆహారం ఎక్కువగా తీసుకునే వారు.

ఈ రోజుల్లో ఎక్కువగా బయట ఆహారం తీసుకోవటం జరుగుతోంది.

 పాతకాలంలో...  కొబ్బరి నూనె, పసుపు, కారం ...వంటివి  ఇంట్లోనే తయారుచేసుకునేవారు.


 ఈ రోజుల్లో అల్లం..వెల్లుల్లి పేస్ట్ కూడా బయట నుంచి కొని తెచ్చుకునే పరిస్థితి ఉంది.

బయట నుంచి తెచ్చుకునే వాటిలో నిల్వ ఉండటం కోసం కొన్ని రసాయనాలు కలిపే అవకాశం ఉంది.

 ఈ రోజులలో  పదార్ధాల రుచికొరకు వాడే రసాయనాలతో కూడిన ఆహారాన్ని తినటం ఎక్కువయింది.  


 జంక్ ఫుడ్ వల్ల రుచి బాగుంటుంది కానీ, రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

 ఆహారపదార్ధాలలో రుచి పెరగటం కోసం  ఈ రోజుల్లో  చాలామంది ..  ఎన్నో వంటలలో  బేకింగ్ సోడా, అజనిమోటో వంటివి.. వాడుతున్నారు. 

 అజనిమోటో  బయట షాపులలో సులభంగా లభిస్తుంది. ఇవన్నీ వాడటం వల్ల ఆహార పదార్ధాలకు ఒక విధమైన  రుచి  రావటం వలన  వీటి  వాడకం  బాగా పెరిగింది.

 ఆ రుచికి అలవాటుపడటం వల్లకు మళ్లీమళ్లీ అవే తినాలనిపిస్తుంది.  అలా శరీరంలోకి  వెళ్లే అజనిమోటో పరిమాణం బాగా పెరుగుతుంది. 


 అజనిమోటో  తరచు వాడితే కలిగే నష్టాలు చాలామందికి తెలియదు.

ఇంట్లో చేసుకునే వంటలలో కూడా అజనిమోటో, సోడాఉప్పు వంటివి ఎక్కువగా వాడటాన్ని తగ్గించాలి.

నాకు తెలిసినంతలో సోయాసాస్ , వెనిగర్ వంటివి పదార్ధాలను నెలల తరబడి పులవబెట్టి తయారుచేస్తారు.


   కెమికల్స్ తో కూడా సోయాసాస్, వెనిగర్ తయారుచేస్తారట.

 మన పూర్వీకులు  సోడాఉప్పు వంటివి  వాడకుండానే వెన్న వాడి  కరకరలాడే రుచికరమైన స్నాక్స్ చేసేవారు. 

................................

 పాత రోజుల్లో  సూర్యరశ్మి, వెన్నెల, గాలి, వెలుతురు ప్రసరించే విధంగా జీవనశైలి ఉండేది.

 ఈ రోజుల్లో  ఎక్కువగా  నాలుగుగోడల మధ్యన సెల్ ఫోన్స్, టీవీ, కంప్యూటర్స్.. మధ్యే ఉంటున్నారు.  


అనారోగ్యాలు పెరగటానికి ఇవన్నీ కారణాలే.

40 సంవత్సరాల క్రిందట కూడా  కాన్సర్, కిడ్నీ..వంటి వ్యాధులు  అరుదుగా ఉండేవి.  


ఇప్పుడు చిన్నపిల్లలలో కూడా కాన్సర్, కిడ్నీ..వంటి జబ్బులు వస్తున్నట్లు  వింటున్నాము.

ఆరోగ్యమే మహాభాగ్యం.  ఆరోగ్యాన్ని  అశ్రద్ధ  చేయరాదు.



Monday, July 11, 2016

విపరీతమైన జనాభా పెరుగుదల అనేక సమస్యలకు మూలం.

విపరీతమైన జనాభా పెరుగుదల వల్ల అనేక నష్టాలున్నాయి.

  విపరీతంగా జనాభా పెరిగితే వనరులు సరిపోవు. 

దేశంలో ఆహార కొరత,  నిరుద్యోగ సమస్య ఎక్కువ అయ్యే  పరిస్థితులు ఏర్పడుతాయి.  

ఆహార కొరత,   నిరుద్యోగ సమస్యల  వల్ల  దేశంలో నేరాలు కూడా పెరుగుతాయి. 

 జనాభా పెరిగే కొద్దీ  దేశం జనాభాతో  కిటటలాడుతూ మురికిగా ఉంటుంది. 

విపరీతమైన జనాభా పెరుగుదల  అనేక సమస్యలకు మూలం. 

  అయితే,  మరీ ఒక్కరే కాకుండా,  ఇద్దరు సంతానం ఉంటే మంచిది. 

Wednesday, July 6, 2016

పండుగల సందర్భంగా శుభాకాంక్షలు..




జగన్నాధ రధయాత్ర శుభాకాంక్షలు...మరియు  Ramazan (Ramadan)శుభాకాంక్షలు. 



Saturday, July 2, 2016

శ్రీ అమర్‌నాధ్ శివలింగం రూపం లాంటి రూపం ఫ్రిజ్ లో.... ..మరియు కొన్ని విషయములు..



శుభప్రదమైన 2016 సంవత్సరపు అమర్ నాధ్ యాత్ర ప్రారంభమయింది. 

 .........

విజయవాడలో ఉన్న  కనకదుర్గమ్మ దేవాలయానికి వెళ్ళే దారిలో ఉన్న విఘ్నేశ్వర స్వామి దేవాలయాన్ని కూల్చివేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా  చేయాలనుకోవడం చాలాచాలాతప్పు.

 

*********

ఇంతకుముందు వ్రాసిన ఒక టపా కూడా ఇక్కడ ఇస్తున్నాను .

 

 Friday, June 18, 2010





శ్రీ అమర్‌నాధ్ శివలింగం రూపం లాంటి రూపం ఫ్రిజ్ లో.... ..




ఈ విషయం చెప్పాలని ఎప్పటినుండో అనుకుంటున్నానండి. ఇది సుమారు అయిదు సంవత్సరముల క్రిందట జరిగింది.


అప్పట్లో మేము చెన్నైలో ఉండేవాళ్ళమండి. మా ఫ్రిజ్ లో ఎప్పుడు అందరికిలానే అయిస్ ఫార్మ్ అవుతుంది. కానీ ఒకసారి అయిస్ పెద్ద ఆకారములో దగ్గరదగ్గర శ్రీ అమర్‌నాధ్ శివలింగం ఆకారములో ఏర్పడిందండి. డీప్ ఫ్రిజ్లో నీరు బొట్లుబొట్లుగా పడుతూ రెండు ఆకారములు ఏర్పడ్డాయి. ముందు నేను గమనించలేదు. తర్వాత చూసి ఆశ్చర్యపోయామండి. ఒక ఆకారానికి ముఖము లాగ కూడా అనిపిస్తోంది.




. ప్రక్కన వాళ్ళకు చూపిస్తే ఫొటోస్ తియ్యమని సలహా ఇచ్చారు. కొన్నాళ్ళు తరువాత ఆ అయిస్ కరిగించి నీరు శ్రీ పిడారి నవశక్తి కాళీ అమ్మన్ అమ్మవారి గుడిలోని చెట్టు మొదట్లో పోశానండి. గుడివారికి ఈ విషయములు చెప్పలేదండి. ఈ ఫ్రిజ్లోని అయిస్ తో ఏర్పడ్డ ఆకారములను కొందరికి మాత్రమే చూపించామండి. అంటే అసలే రోజులు బాగాలేదు కదా ఎవరికయినా చెప్పినా నమ్మకపోగా మేమే ఇలా అయిస్ తో ఏర్పాటు చేశామని అన్నా అంటారు. ఎందుకొచ్చిందని ఊరుకున్నామండి.



కానీ తరువాత ఏమనిపించిందంటే భగవంతుని కి సంబందించిన వింతలు ఇతరులుకు కూడా చూపిస్తే మంచిది కదా అని. అలా కొందరికి ఫోటోస్ ను మెయిల్ చేశాము. ఈ ఫోటోస్ ను చూస్తే నాకు కొంచెము బాధగా అనిపిస్తుంది ఎందుకంటేనండి. అప్పుడు వీడియో తీయించుకోలేకపోయాము. వీడియోలో అయితే బాగా కనిపిస్తుంది కదా... ఇప్పుడు మాకు వీడియో కెమెరా ఉంది కానీ అలా మళ్ళీ ఏర్పడలేదు. . . . . .నేను అయితే ఇది అద్భుతం అనుకుంటాను. .


ఇది సహజంగానే అలా ఏర్పడిందండి. ఇక నమ్మటం నమ్మకపోవటం ఎవరి ఇష్టం వాళ్ళది. .ఆ భగవంతుని దయవలన క్రితం సంవత్సరం మేము ,పిల్లలతో శ్రీ అమర్ నాధ్ జీ యాత్ర, శ్రీ వైష్ణవీ దేవి అమ్మవారి యాత్రలు చేసి వచ్చామండి. .....