koodali

Monday, August 3, 2015

శంభూక వధ...

 
శ్రీరాముల వారు..శబరి ఇచ్చిన పండ్లను చక్కగా స్వీకరించారు.  గుహునితో  స్నేహం  చేసారు. పక్షి అయిన జటాయువు యొక్క అంత్యక్రియలను నిర్వహించారు. అలాంటి రాములవారిని అపార్ధం చేసుకోవటం పొరపాటు.


 శూద్ర కులానికి చెందిన భక్తురాలైన శబరిని కరుణించిన రాముడు శంభుకుని తపస్సు చేసినంత మాత్రాన్నే వధించటం ఎందుకు జరుగుతుంది ?
........................ 

రాముడు.. శూద్రుడైన శంభూకుని సంహరించటం  గురించి ...నాకు ఏమనిపిస్తోందంటే..

కొందరు మంచి కోరికలతో, ఉద్దేశ్యాలతో తపస్సులు చేస్తారు.

 కొందరు మనసులో స్వార్ధపరమైన కోరికలతో తపస్సులు చేస్తూ పైకి మంచిగా కనిపిస్తారు.
........................ 

బహుశా శంభుకుడు విపరీతమైన  కోరికలతో  తపస్సును చేస్తూ ఉండి ఉంటాడు ..  అందుకే రాములవారు వధించి ఉంటారు.
....................... 
 
రాక్షసులు కూడా తపస్సులు చేయటం, దేవతలు వరాలు ఇవ్వటం జరుగుతుంటుంది.

రాక్షసులే తపస్సు  చేసి వరాలను పొందుతుంటే  ..   మానవులలో కొన్ని కులాల వాళ్ళు తపస్సులు చేయకూడదు...  అనే విధానం   ఉంటుందని అనుకోనవసరం లేదు.
.........................
ప్రహ్లాదుని వంటివారు రాక్షస జాతికి చెందినా..  దైవ భక్తులై దైవానుగ్రహాన్ని పొందారు. 

 కానీ కొందరు రాక్షసులు స్వర్గాన్ని , దేవతలను జయించాలని తపస్సులు చేసారు... శిక్షించబడ్డారు. 
....................... 

 శంభూకుడు బొందితో స్వర్గానికి వెళ్ళాలని తపస్సు చేస్తున్నట్లుగా ఒక దగ్గర చదివాను.

హరిశ్చంద్రుని తండ్రి అయిన త్రిశంకుడంతటి వారినే బొందితో స్వర్గానికి రావటానికి .. ఇంద్రుడు అంగీకరించ లేదు.

 ఇవన్నీ గమనిస్తే, శంభూకుని వధించటానికి కులం అన్నది కారణం కాదనిపిస్తుంది.

ఈ విషయంలో మనకు తెలియని మరికొన్ని కారణాలు కూడా ఉండి ఉండవచ్చు.
...................... 

Shudra Hindu saints అని అంతర్జాలంలో చూస్తే ఎందరో భక్తుల వివరాలు ఉన్నాయి.  


నందనార్ అనే శూద్ర భక్తుని దైవం కరుణించటం ....వంటి విషయాలను గమనిస్తే , దైవం దృష్టిలో అందరూ సమానులే అన్న విషయం అర్ధమవుతుంది.



2 comments:

  1. రాక్షసులు తపస్సు చేసినా కూడా వారిని చంపలేదు. అలాంటప్పుడు మనుషులు తపస్సు చేస్తే చంపరు కదా..శంభూకుడిని చంపారంటే శంభూకుడు ఎంత చెడ్డవాడో తెలుస్తోంది. అతను వినాశకరమైన రీతిలో వరాలను పొందటానికి తపస్సు చేస్తుండవచ్చు. అందుకే చంపారు.

    చిత్రం ఏమిటంటే, కొందరు రాక్షసప్రవృత్తికలవారు కూడా తపస్సు చేసి.. దేవతలను జయించేలా వరాన్ని ఇమ్మని దేవతలనే అడిగి.. ఆ వరాలతో శక్తిని పొంది దేవతలను బాధించాలని అనుకుంటారు.

    శంభూకుడు తాను శరీరంతో స్వర్గానికి వెళ్లాలని, స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నట్లు చెప్పటం జరిగిందట. అలాంటప్పుడు చంపక ఏం చేస్తారు? చెడ్డవారు బ్రతికుంటే మరిన్ని పాపాలు చేసి తమ పాపాలను పెంచుకుంటారు..అలాంటి చెడ్డవారిని వధించటం వల్ల ఆ చెడ్డవారికి మంచి జరుగుతుంది..ఇంకా సమాజానికి కూడా మంచి జరుగుతుంది.

    **************
    ఎవ్వరివిషయంలోనైనా వాళ్ళు ఎవరికి జన్మించినా, వారి ప్రవర్తన ముఖ్యం. ప్రహ్లాదుడు రాక్షసవంశంలో జన్మించినా కూడా గొప్పవిష్ణుభక్తులయ్యారు.

    శ్రీరాములవారు తపస్వి అయిన శబరిని, గుహుడుని, విభీషణుడిని ఆదరించారు. పక్షి అయిన జటాయువుకు అంత్యక్రియలను నిర్వహించారు.

    శ్రీరాములవారు రావణాసురుడిని సంహరించారు. రావణుడి తండ్రి బ్రాహ్మణులు, తల్లి రాక్షసస్త్రీ...రావణుడు ఎందరో స్త్రీలను చెరపట్టటం జరిగింది. సీతాదేవిని బాధపెట్టాడు...అలాంటివ్యక్తిని చంపితే తప్పేమీలేదు. చంపకపోతేనే తప్పు.

    ఎంతటివారైనా సరే పాపాలు చేస్తే శిక్షలను పొందినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.

    శ్రీకృష్ణుని వారసులు కొందరు, మహర్షితో అసత్యంతో కూడిన మాటలు మాట్లాడి శాపాన్ని పొందారు.అయినా శ్రీకృష్ణులవారు వారిని కాపాడలేదు.

    ************
    శ్రీకృష్ణుడు గురుదక్షిణగా తమ గురువుయొక్క పుత్రులను బ్రతికించి తెచ్చారు. పరీక్షిత్తుకు ప్రాణదానం చేసారు. అయితే, అభిమన్యుని కాపాడలేదు. వీటివెనుక ఎన్నో రహస్యాలుంటాయి. ఆ జీవుల గతకర్మలు వంటి ఎన్నో రహస్యాలు కూడా ఉంటాయి. ఏది ఎందుకు జరుగుతుందో..దైవానికి తెలుస్తాయి.

    ReplyDelete
  2. ఇంకో కోణం ఏమిటంటే, ఉత్తరకాండలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చని కొందరి అభిప్రాయం. శంభూకునివధ కానీ, ఆ కధలో కొన్ని భాగాలు కానీ ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు చేసినప్పుడు కొన్ని శ్లోకాలను మార్చి ఆ స్థానంలో వేరే శ్లోకాలను వ్రాసి, అదే సంఖ్యలో శ్లోకాల లెక్క సరిపోయే విధంగా మార్చివ్రాయటం చేసేవారు చేయగలరు.

    ***********
    నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎవరైనా రాక్షసుడు శంభూకుని రూపంలో వచ్చి తపస్సు చేస్తుండవచ్చు. రాక్షసప్రవృత్తి గలవారికి సమాజం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. ఎప్పుడూ గొడవలు, ఇతరులను చంపటం, యుద్ధాలు వంటివి చేయడాన్ని ఇష్టపడతారు.

    శంభూకుడు స్వర్గాన్ని జయించటానికి తపస్సు చేస్తూ మధ్యలో రాజ్యంలో పిల్లల్ని కొందరిని చంపాడేమో? ఇవన్నీ గమనించిన శ్రీ రాములవారు శంభూకుని చంపేసి ఉండవచ్చు. శంభూకుడు రాక్షసుడైనా కావచ్చు, రాక్షసప్రవృత్తి కల మనిషైనా కావచ్చు. ఏమో ఏదైనా అయ్యుండవచ్చు.

    వ్రాసినవాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే, దయచేసి క్షమించమని దైవాన్ని కోరుకుంటున్నాను.

    ReplyDelete