విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయం గురించి కొన్ని విషయాలను వ్రాయాలనిపించి వ్రాస్తున్నానండి.
దైవం, దేవాలయం కొరకు ఎందరో అర్చకులు, భక్తులు, అధికారులు మరియు సిబ్బంది చక్కటి కృషి చేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే, ఇంకో విషయం ఏమిటంటే, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి దేవాలయానికి సమీపంలో (మెట్ల ప్రక్కన ) ఉన్న కొండ ప్రాంతాన్ని పైనుంచి త్రవ్వినట్లు కనిపించింది.
శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయం కొంతభాగం కొండ అంచుకు సమీపంలో ఉంది....
అలాంటప్పుడు, దేవాలయానికి సమీపంలో అలా కొండను చెక్కటం ఎంతవరకు సరైనదో? అనే సందేహం కలిగింది.
ఒక ప్రక్క కొండను పటిష్టపరిచే చర్యలు జరుగుతున్నట్లుగా కూడా అనిపిస్తోంది.
ఒక ప్రక్కన కొండను పటిష్టపరిచే పనులు జరగటం మంచి విషయం.
ఇంకో ప్రక్కన కొండ త్రవ్వి ఉండటం చూసిన తరువాత ఆందోళన కలిగింది.
ఈ విషయాలను రాయాలనిపించి వ్రాస్తున్నాను.
అక్కడ జరుగుతున్న పనుల గురించిన వివరాలు నాకు సరిగ్గా తెలియదు.నాకు తెలిసినంతలో విషయాలను వ్రాసాను.
వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
అంతా దైవం దయ.
*************
ఈ విషయాన్ని ఈ పోస్ట్ వేసిన చాలాకాలం తర్వాత వ్రాసి పోస్ట్ చేసానండి.
దేవాలయానికి బహుళ అంతస్తుల మెట్లు ఎక్కి వెళ్ళే దారి అంటే లిఫ్ట్ వద్దకు వెళ్ళే దారి పైన రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. చెప్పులు లేకుండా వచ్చే వారికి.. పిల్లలకు చాలా కష్టంగా ఉంటుంది.
కొందరు పెద్దవాళ్లు తమ పిల్లలను చెప్పులు లేకుండా నడిపిస్తున్నారు. దయచేసి దేవాలయం వారు దారిపైన రాళ్లు గుచ్చుకోకుండా ఏమైనా చేయిస్తే బాగుంటుంది.
మరికొన్ని విషయాలు ఏమిటంటేనండి..
ReplyDeleteతులసి మొక్క వద్ద దీపం మొక్కకు మరీ దగ్గరగా పెట్టకుండా, మొక్కకు కొంత దూరంగా పెడితే మంచిది. అప్పుడు, మొక్కకు వేడి తగలకుండా ఉంటుంది.
దేవాలయాల్లో కూడా ఉసిరి..వంటి దేవతా వృక్షాల వద్ద దీపాలను కొంత దూరంగా పెట్టడం మంచిది. అందరూ దీపాలను వెలిగించి మొక్కకు మొదట్లో పెట్టేయటం వల్ల మొక్కకు వేడి ఎక్కువయే ప్రమాదముంది.
నాగులచవితి రోజు పుట్టల వద్ద పూజ కొరకు దీపాలను, అగరుబత్తులను వెలిగిస్తారు. దీపాలను, అగరుబత్తులను పుట్టలపైనే వెలిగించటం సరైనది కాదనిపిస్తుంది.
పుట్టలలో పాములు ఉండి, మనుషులు వెళ్ళిన తరువాత ఆ నాగులు పుట్టపైన తిరిగితే... దీపాలు మరియు అగరుబత్తులు ఆ నాగులకు తగిలే ప్రమాదముండవచ్చు. అందువల్ల, దీపాలను మరియు అగరుబత్తులను పుట్టకు కొంచెం దూరంగా పెడితే మంచిది.
కొందరు దేవాలయాలలో ఉండే ఉసిరి వంటి మొక్కలకు నీటిని పోస్తారు.
ఒకరిని చూసి మరొకరు ..అలా చాలామంది ఆ మొక్కకు నీరు పోస్తే, నీరు ఎక్కువై మొక్క కుళ్ళిపోయే పరిస్థితి రావచ్చు. ఎంతవరకూ అవసరమో అంతవరకే నీటిని పోయాలి.