koodali

Tuesday, March 30, 2010

విడాకుల వలన లాభమా....

 
 
అసలు 90 పర్సెంట్ ఆడవాళ్ళు, 90 పెర్సెంట్ మగవాళ్ళు ఒకే మెంటలిటి ఉంటుందని నా అభిప్రాయము. కొంతమంది రెండు, మూడు పెండ్లిండ్లు చేసుకున్నాక అప్పుడు తత్వము తెలుసుకుంటారు. ఇక చేసేదిలేక అప్పుడు సర్దుకుపోవటము నేర్చుకుంటారు. తాము చాలా సంతోషముగా ఉన్నట్లు ప్రపంచానికి కనిపిస్తారు. ఈ సర్దుకుపోవటము మొదటి పెండ్లివారితోనే అయితే కనీసము వారి తల్లితండ్రులు,పిల్లలు అయినా సంతోషముగా ఉంటారు.
 

పోనీ,  ఇంకో అవకాశం చూడాలి.. అనే ఆశ ఉండటం సహజం కాబట్టి, ఒక వివాహం ఫెయిల్ అయినప్పుడు, తిరిగి  ఇంకో వివాహం చేసుకోవటం కొంత వరకూ ఫరవాలేదు. అలాగని పదేపదే ఫెయిల్ అవటం, తిరిగి వివాహాలు చేసుకోవటం సరికాదనిపిస్తుంది.


ఈ సారి భార్యాభర్తలూ మీమద్య గొడవ వచ్చినప్పుడు మీరు ముసలి వారు అయ్యాక మీ పిల్లలు,కోడళ్ళు,అల్లుళ్ళు, లేక వ్రుద్దాశ్రమములో ఎవరయినా మిమ్ములను విసుక్కోవటము మీరు ఓపికలేక నోరుమూసుకుని సర్దుకుపోవటము ఊహించుకోండి. ఇది పెద్దయ్యాక ప్రతి ఒక్కరికి తప్పని పరిస్తితి. మరి వారందరిమాట వినే మనము భార్య మాటభర్త, భర్తమాటభార్య వింటే తప్పేమిటి.ఇంకా మనసు భరించక పోతే భగవంతుని సహాయము చెయ్యమని ప్రార్దించండి.


ఇక మరీ తప్పని పరిఖర్మ ప్రకారము విడిపోవాలిసివస్తే వేరే వారి కాపురము లో చిచుపెట్టకుండా గౌరవముగా ఉంటే బాగుంటుంది. అప్పుడుఅందరూ గౌరవిస్తారు. అందరి కాపురములు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. 



Saturday, March 27, 2010

జీవితాంతము ఈ అమ్మ,నాన్న ఉంటారా..లేక కొత్త అమ్మ నాన్న వస్తారా..

 

 

ఈ రోజుల్లో భార్యాభర్తలు విడాకులు తీసుకోవటము ఎక్కువగా చూస్తున్నాము. పిల్లలు వారి జీవితాంతం ఈ అమ్మా,నాన్న ఉంటారాలేక... వారు విడిపోయి కొత్త అమ్మానాన్న వస్తారో తెలియని .....అతి చిత్రమయిన పరిస్తితిలో చాలామంది పిల్లలు ఉన్నారు.


అంటే మరి.... తల్లితండ్రి వేరే పెండ్లి చేసుకుంటే......... కొత్తా అమ్మానాన్న వస్తారు కదా అలా అన్నమాట.


ఇది రాయటానికి నాకు చాలా బాధగా ఉంది. ఈ రోజుల్లో భార్యాభర్తలను చూస్తే నాకు చాలా జాలిగా కూడా ఉంటుంది. రకరకముల ప్రాబ్లంస్ ,ఒకోసారి పెద్దలు పంతాలు ,పట్టింపులు కూడా పెద్దపెద్ద గొడవలవుతాయి.



ఏదిఎలా ఉన్నా ఒక జంట గుర్తుంచుకోవాల్సింది ఏమంటే......... మనము జీవితములో చిన్నతనములో పెద్దల మాట గౌరవిస్తాము. మరి మన ముసలితనములో మన కోడళ్ళను,అల్లుళ్ళను చచ్చినట్టు గౌరవించక తప్పదు. ఏమంటే అప్పుడు మనకు ఒపిక ఉండదు కాబట్టి.


మరిఈ మద్య కాలంలో జీవితములో ఎంతమందికి అంటే ఆఫీసులలో పైవారికి ,ఇంటిప్రక్కవారికి,పనివారితోను,కూరలవారితోను,మనసొంతపిల్లలతోను, ఇలాఎంతో మందితో సర్దుకుపోతుంటాము.మనకు ఇష్టము ఉన్నా,లేకపోయినా.

మరి భార్యాభర్తలు కూడా ఇలా సర్దుకుపోతే ఈప్రపంచములో చాలా ప్రశాంతముగా ఉంటుంది. ముఖ్యముగా వారి జీవితము ఎంతో సంతోషముగా ఉంటుంది.



నాకుతెలుసు ఇది కష్టమయిన పని అని. కాని కొంచము ప్రయత్నించిచూడండి. మనము కుటుంబం అన్నాక పెద్దల వల్ల , పిల్లలు, ఆర్దిక సమస్యలవల్లా భార్యాభర్తలకు తప్పక గొడవలు వస్తాయి. బయటివారికి ఇవన్నీ ఉండవు కాబట్టి ఇన్ని సమస్యలు రావు,



మనము మన చిన్నతనములో మన అమ్మమ్మా,నాయనమ్మా ఊర్లు వెళ్తే,......... వారు ఎంత ఆప్యాయముగా మనల్ని చూసారో మనపిల్లలకు కధలుగా చెపుతాము.


మరి మన పిల్లలకు మనము ఇలాంటి ప్రేమలు ఇవ్వాలంటే మన పిల్లలు మనుమలు, మనుమరాండ్రు మన ఆప్యాయతలు పొంది సుఖముగాపెరగాలంటే ఈనాటి భార్యాభర్తలు కూడా సర్దుకుపోకతప్పదు.



మనపెద్దలు సర్దుకుపోయారు కాబట్టి మనము ఇలాసంతోషముగా ఉన్నాము. మనపిల్లలు ఇంటికి వచ్చినప్పుడు తమ సొంత అమ్మ బదులు వేరే అమ్మ ,....సొంతనాన్న బదులు వేరే నాన్న ఉంటే వారి మనస్సూ ఎంత భాదగా ఉంటుందో ఆలోచించండి. వారు ఎంత బాగా చూసినా సరే..


ఈసారి పోట్లాటలు వచ్చినప్పుడు బయట అయితే కోపము ఎలా అణుచుకుంటామో గుర్తు తెచ్చుకోండి. అందరి కాపురములు సంతోషముగా ఉండాలని కోరుకుంటున్నాను. ...

 

Friday, March 26, 2010

హక్కులు పెద్దలకేనా..పిల్లలకు వుండవా..

 

ఈ రోజుల్లో ప్రపంచము లో సంస్క్రుతి బాగా మారిపోయింది.ఇప్పుడు ఎక్కువ మంది భార్యాభర్తలు తమ హక్కుల గురించి ఆలోచిస్తున్నారు.మరి పిల్లలకు బాధలు ,భయములు ఉంటాయి కదా.

డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఈ నాడు తల్లితండ్రి ఇద్దరు ఉద్యోగములకు వెళ్ళటము వల్ల చాలా చిన్న పిల్లలను క్రెచ్లలో వదిలి వెళ్తారు. అక్కడకొన్ని దగ్గర బాగా చూస్తారు. కొన్నిదగ్గర సరిగ్గా చూడకపోవచ్చు.ఏంతైనా తల్లిలా చూస్తారా..


మరి ఆ పిల్లలకు తమ భాధలు చెప్పుకోవటానికి భగవంతుడే దిక్కు. పెద్దవాళ్ళు చెప్పే జవాబు మేము వాళ్ళ కోసమే దబ్బు సంపాదిస్తున్నామని.




ఇప్పుడు ప్రశ్న ఏమంటే ఇదే పెద్దలు వారి ముసలితనములో వారి పిల్లలు వారిని వ్రుద్దాశ్రములలో చేర్పిస్తే మాత్రము ఎంత ఘోరం........... మాపిల్లలు మమ్మల్ని ప్రేమగా చూడటము లేదు మాకు డబ్బు కాదు ప్రేమ కావాలి ఈ వయసులో ........ అని అందరికి చెప్పి భాధ పడుతారు.

కొంతమంది కోర్ట్ కూడా కేస్ పెడతారు. వీరికి తమ పిల్లల చిన్నతనములో వారితో మాట్లాడటానికి టైం ఉండదు. మరి ఇప్పుడు వారి పిల్లలకు వీరితో మాట్లాడటానికి టైం ఉండదు.


ఏమంటే ఆ పిల్లలు వారికి పుట్టిన పిల్లలకు సంపాదించటములో బిజీగా ఉంటారు కాబట్టి. పెద్ద వయసులో మనము పిల్లల ప్రేమను కోరుకున్నప్పుడు.......... మరి పిల్లలు వారి చిన్నతనాన్ని బయటేక్కడో ఎందుకు గడపాలి. ఎందుకంటే వారికి మాటలు రావు కాబట్టి. వారికి హక్కులు తెలియవు కాబట్టి.



మనకు గాని మన పిల్లలకు గానిజీవితములో ఏదైనా కష్టము వచ్చినప్పుడు అది పోవాలంటే భగవంతుడు మన కోట్ల ఆస్తిని చూసి మనల్ని కాపాడడు. మనము ఎన్ని మంచి పనులు చేసామో చూసి వాటిని బట్టి రక్షిస్తాడు.


అందుకని నా అభిప్రాయము ఏమంటే మనము జీవితములో సుఖముగా ఉండాలంటే మన ము ప్రక్రుతిని సర్వనాశనము చేసేసి భూమిని తవ్వేసి చందమామను కూడాను పొల్యూట్ చెయ్యటానికి కూడా రడీ అయిపోతున్నాము.


విషాదమేమంటే ఇన్ని సౌకర్యాలు పెరిగినా ఏ ఒక్కరికి మనశ్శాంతి లేదు. మనము మనకు సరిపడినంత ఆస్తి మాత్రము సంపాదించుకుని................ నలుగురికి సహాయపడితే భగవంతుడు మనకు మంచి చేస్తాడు. మనకు కూడా ఎంతో సంతోషముగాఉంటుంది.


ఏదో నాకు తోచింది రాసేసాను,దయచేసి ఎవరి మనసునైనా కష్టపెడితే క్షమించండి.

 

Thursday, March 18, 2010

మన ఆచారములు అన్నిచాదస్తములా ........

 

మన ఆచారములు అంతా చాదస్తమేనా..........

ఏ విషయములో అయినా మంచిని మాత్రమే గ్రహించాలి అని నా అభిప్రాయమండి. అంటే మన పాత ఆచారములు గాని క్రొత్త సైన్స్ గాని వీటి వల్ల నైతికత తో కూడిన ఆనందం మనకు కలగాలి.

సైన్స్ మరియు భగవంతుడు వేరని ఎందుకు అనుకోవాలి . ఇంత గొప్ప ప్రపంచాన్ని స్రుష్టించిన భగవంతుడు పెద్ద సైంటిస్ట్ అని నా అభిప్రాయము.




మనము గుమ్మానికి పసుపు రాయటము వల్ల గాలికి బయట నుంచి వచ్చే దుమ్ము ఆ గడపకు తగిలి ఇంట్లోకి రాకుండా గడప కాపాడుతుంది.ఆపసుపు లోని ఆంటిబయొటిక్ గుణము వల్ల ఆ దుమ్ము లోని చెడు క్రిములు చనిపోతాయి.


ఇవన్నీ అర్ధము కావని గుమ్మానికి పసుపు రాస్తే డబ్బు వస్తుందని పెద్దవాళ్ళు చెప్పారు.మరి మనము ఈ రోజుల్లో పసుపు రంగు పెయింట్ వేసేసి................. పెద్దవారు చెప్పినదానివల్ల ఏమి ఉపయోగము....... అంతా చాదస్తము అంటున్నాము.



అలాగే చెట్ల ఆకులు కార్బండైఆక్సైడ్ గ్రహించి ఆక్సిజెన్ విడుదల చేస్తాయని మనకు తెలుసు.ఒక్క మామిడి చెట్ల ఆకులు మాత్రము చెట్ల నుంచి కోసిన తరువాత కూడా ఆక్సిజన్ రిలీజ్ చేసే శక్తి కలిగి ఉంటాయట.


అందుకని ఎక్కువమంది కలిసే ఫంక్షన్స్ లో మామిడి ఆకులు కట్టడము వల్ల గాలి శుభ్రముగా ఉంటుంది. ఈ రోజుల్లో ఇవన్నీ సైంటిస్ట్స్ కనిపెడుతున్నారుకదా.


ఎన్నో వందల సంవత్సరముల మన ఆచారములలో......... తెలిసీ తెలియని కొంతమంది......... చెడ్డ ఆచారములు ప్రవేశపెట్టడము వల్ల మనము అన్ని ఆచారములు తప్పని చెప్పకూడదు.

మీ అందరికి థాంక్స్. నా అభిప్రాయములు చదివినందుకు. నాకు కంప్యూటర్ ఆపరేట్ చెయ్యటము సరిగ్గా రాదండి. దయచేసి తప్పులు క్షమించండి.


.ప్లాస్టిక్ మామిడి ఆకులు బదులు నిజమయిన ఆకులు వాడుదాము....

 

Wednesday, March 17, 2010

భగవంతుని విషయములో మనము చేసేది తప్పా......

 

నా బ్లాగ్ పేరు ఆనందం.నావంటి సామాన్యులు కూడా మా అభిప్రాయములు తెలిపేవిధముగా ఇటువంటి టెక్నాలజీ కనిపెట్టిన ప్రతిఒక్కరికి నా ధన్యవాదములు.


భగవంతుని ఫొటోస్ గురించి నా అభిప్రాయములు చెప్పాలని ఉంది. దయచేసి మీరూ ఆలొచించండి.

మనము దేవుని ఫొటోస్ కూడా దేవునితో సమానముగా గౌరవిస్తాము. మరి ఎక్కువగా ప్రింట్ చేసి వాడిన తరువాత చెత్త లో వెయ్యటము వల్ల పుణ్యం రాకపోగా పాపము వస్తుందని నా అభిప్రాయము.



మనము గుడికి వెళ్ళేటప్పుడు దారిలో చించి పడవేసిన హారతి మఱియు అగరుబత్తి కవర్లు వాటిపైన దేవుని బొమ్మలు మీరు చూసే ఉంటారు. అవి తొక్కుతూనే మనము గుడిలోకి వెళ్తాము .మరి ఇది ఎంత ఘోరం.

ఈరోజుల్లో గుడి లో ఇచ్చే ప్లాస్టిక్ ప్రసాదం కవర్స్ పైన కూడా దేవుని బొమ్మలు ఉంటున్నాయి.


మరి ప్రసాదం తిన్నాక ఆ కవర్లు నీటిలో వేస్తే పొల్యుషన్. మరి అయిపోయిన ప్రసాదం కవర్లు ఎక్కడ వెయ్యాలి అన్నది సమస్య. వాటిని చెత్తకుప్పలలోనే వెయ్యటం ఎంతో పాపం .


అందుకే భగవంతుని బొమ్మలు తక్కువగా ప్రింట్ వేసి భగవంతుని ఎక్కువగా మనసులో నిలుపుకుందాము.ఆదేవుని దయకు పాత్రులమవుదాము.

మన పాత కాలములో ఇన్ని విగ్రహములు లేకపోయినా వారు మనకంతే తక్కువ భక్తులు కాదని నా అభిప్రాయము.

మనము అందరము ఈ విషయం దయచేసి ఆలోచించాలి.


ఈ రోజుల్లో మన కష్టాలకు ఇలా భగవంతుని అవమానించటము కూడా ఒక కారణమని నా అభిప్రాయము.

ఆ మద్య కొందరు మన దేవుని బొమ్మలు చెప్పులమీద ప్రింట్ వేసినందుకు ఛాలా బాధ పడ్డాము. మరి మనము చేసే పనులు కూడా అటువంటివే కదా దయచేసి ఆలోచించండి...
.